మహిళలపై జరిగే అత్యాచారాలకు ప్రతిస్పందనే ‘విజిల్’ – అట్లీ
‘ప్రస్తుత సమాజంలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ విషయాలు నన్నెంతో బాధించాయి. ఆ కారణాలతో నేను ‘విజిల్’ కథను రాశాను. ఈ సినిమా మహిళలు గురించి చెబుతుంది. ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. ప్రతి మహిళ, పురుషుడు ఈ సినిమాను చూడాలి. అందుకే ఈ చిత్రాన్ని మహిళలకు అంకితమిస్తున్నాను” అని దర్శకుడు అట్లీ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.
విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. అట్లీ దర్శకత్వం. నయనతార హీరోయిన్గా నటిస్తుంది. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించారు. ‘విజిల్’ పేరుతో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ ‘ఈ సినిమాను తెలుగులో 700 థియేటర్లలో విడుదల చేస్తుండటం గొప్పగా అనిపిస్తుంది. విజయ్ లేకుండా నేను లేను. ఆయన వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ఇది యాక్షన్ డ్రామా ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ మూవీ. కేవలం ఫుట్ బాల్ స్పోర్ట్ మాత్రమే కాదు, చాలా ఎమోషన్స్ను క్యారీ చేస్తుంది. అలాగే మహిళా సాధికారతను తెలియజేస్తుంది. విజయ్ లాంటి సూపర్స్టార్తో ఓ కమర్షియల్ సినిమా చేసేయవచ్చు. కానీ నేను ఈ సినిమాతో సొసైటీకి ఏదో చెప్పాలనుకున్నాను. ఈ సినిమాను మహిళల కోసమే చేశాను. ఫుట్బాల్కు మన దేశంలో పెద్ద ఆదరణ లేకపోయినా ఈ సినిమా చూస్తే ఓ పాజిటివిటీని ప్రేక్షకులు తమతో తీసుకెళతారని చెప్పగలను. 12 మంది మహిళా ప్లేయర్స్ ఫుట్బాల్ ఆడారు. ప్రతి ఒక క్యారెక్టరూ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.
హరీశ్ శంకర్ మాట్లాడుతూ ‘అట్లీ సినిమాలకు పెద్ద ఫ్యాన్ని. ఆయన డైరెక్ట్ చేసిన ‘రాజా రాణి’ సినిమా నుంచి ప్రతి సినిమాను చూస్తూనే ఉన్నాను. విజయ్ తో ఆయన చేసిన సినిమాలకు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అర్థమైంది. అట్లీ కెరీర్ బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుంది. కమర్షియల్ అంశాలతో పాటు హై ఎమోషన్స్ను ఈ సినిమాలో చూపిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాను ఎంటైర్ ఇండియాలోని ప్రేక్షకులు అభినందిస్తారు. అందులో అంత బలమైన కాంటెస్ట్ ఉంది. ఓ రైటర్గా, డైరెక్టర్గా కంటే.. ఓ ఫ్యాన్గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు.